MLA Kattipalli Venkataramana Reddy : రైతులకు అండగా బీజేపీ

by Sridhar Babu |
MLA Kattipalli Venkataramana Reddy : రైతులకు అండగా బీజేపీ
X

దిశ, కామారెడ్డి : రైతులకు అండగా బీజేపీ ఎప్పుడూ ఉంటుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు అర్హులైన రైతులందరికీ రెండు లక్షల వరకు వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మండలం ఇస్రోజి వాడి గ్రామంలో గురువారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. లక్షా 50 వేల లోపు రుణం మాఫీ అని చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు. రుణ మాఫీ కానీ రైతులు 8886100097 కి పోన్ చేసి వివరాలు చెప్పాలని కోరారు.

ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఆగస్ట్ 15 వరకు ప్రతి రైతుకు 2 లక్షల రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సాంకేతిక కారణాల సాకుతో ఇతర సమస్యల్ని చూపించి చాలా మంది రైతులకు రుణ మాఫీ వర్తించలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా ఆగస్ట్15 వరకు ప్రతి రైతుకు 2 లక్షల రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రుణమాఫీ కాని రైతుల నుంచి వివరాలు తీసుకొని సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు శ్రీధర్, అనిల్, మహిపాల్, పోచయ్య, ప్రశాంత్, తిరుపతి, నగేష్, సుమన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed