కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

by Sridhar Babu |
కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
X

దిశ, జుక్కల్ : కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనుల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే అభివృద్ధి పనులు చేశారని అన్నారు. కుటుంబ పాలన చేసి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నర్సరీ, వైకుంఠధామం, మురుగు కాల్వలు, సీసీ రోడ్లు అన్నీకేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేశారని పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. వారిపై పోటీ చేసిన తనను గెలిపించారని, ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. ఓటర్లకు మద్యం, డబ్బులు పంచకపోయినా బీజేపీ కార్యకర్తల కృషి వల్లనే ప్రజలు తనను గెలిపించారని అన్నారు. కామారెడ్డి నియోజవర్గం ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా తీరుస్తానని హామీ ఇచ్చారు.

సంగారెడ్డి నుండి అకోలా హైవే పనులు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే జరిగాయని తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు. మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి, ఆలే భాస్కర్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తార, సుభాష్ రెడ్డి, జుక్కల్ మండల బీజేపీ అధ్యక్షులు శివాజీ పటేల్ పాల్గొన్నారు.

Advertisement

Next Story