- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
జహీరాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయం
దిశ,నిజాంసాగర్ : దేశ వ్యాప్తంగా జరిగే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహిరాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి గెలుపొందడం ఖాయమని జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జీ, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని జిల్లా అధ్యక్షురాలు అరుణతార అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గత 20 రోజులుగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని 29 మండలాల్లో సమావేశాలను ఏర్పాటు చేసుకున్నామని, అందులో భాగంగా జుక్కల్ నియోజకవర్గం లో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటిగా గెలిచేది జహీరాబాద్ ఎంపీ స్థానమేనని జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని గెలిపించి మోదీకి బహుమతిగా ఇవ్వబోతున్నామని ఆయన అన్నారు. భారతదేశ రక్షణ కోసం, దేశం కోసం బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. కార్యకర్తలు ఉంటేనే పార్టీకి నాయకులు ఉంటారని అన్నారు.ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు మేకల నరేష్, ప్రబరి బద్దం మైపాల్ రెడ్డి, మహిళా మోర్చా గోలి స్వరూప లక్ష్మణ్, జనరల్ సెక్రెటరీ రాము సెట్, జుక్కల్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ పంతులు, ధర్మ, కమ్మరి రాజు, కుమ్మరి కాశీనాథ్, మేకల సంగమేశ్వర్, ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.