ఒకే వేదికపై బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు

by Mahesh |
ఒకే వేదికపై బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
X

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం బసవ గార్డెన్‌లో ఏర్పాటుచేసిన పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో రెండు ప్రత్యర్థి పార్టీల ఎంపీ అభ్యర్థులు వేదికను పంచుకున్నారు. బీజేపీ ఎంపీ, అభ్యర్థి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి‌లు ఒకే కార్యక్రమంలో తమ తమ అర్బన్ రూరల్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఒకరిపై ఒకరు నిత్యం విమర్శలు ఆరోపణలు చేసుకునే రాజకీయ పార్టీల ఎంపీ అభ్యర్థులు పార్లమెంట్ ఎన్నికల వేళ కుల సంఘాల నేతలను అలాగే భారీగా జరిగే కార్యక్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు వ్యూహం రచించుకుంటున్నారు. ఈ క్రమంలో పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కాస్త రాజకీయ రంగు పులుముకుంది.

Advertisement

Next Story