రైతులకు మెరుగైన సేవలు అందించాలి.. మహమ్మద్ అలీ షబ్బీర్

by Sumithra |
రైతులకు మెరుగైన సేవలు అందించాలి.. మహమ్మద్ అలీ షబ్బీర్
X

దిశ, భిక్కనూరు : రైతులకు మార్కెట్ కమిటీ ద్వారా మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. మెదక్ జిల్లా రామయంపేట మండలం జప్తి శివునూరు వద్ద ఉన్న ఫామ్ హౌస్ లో కాంగ్రెస్ నాయకులు ఆయనను కలిశారు. భిక్కనూరులో ఈనెల ఐదున కొత్తగా ప్రమాణ స్వీకారం చేయనున్న పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సేవ చేసే భాగ్యం మీకు కల్పించానని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అటెండ్ అవుతానని వివరించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు తిరుపరి భీమ్ రెడ్డి, బీబీపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుతారి రమేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాకరాజు, వైస్ చైర్మన్ పాపనోళ్ల స్వామి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, సీనియర్ న్యాయవాదులు దేవరాజ్ గౌడ్, సొసైటీ చైర్మన్ గంగల భూమయ్య, నంద రమేష్, తాటిపాముల లింబాద్రి, చిట్టెడి సుధాకర్ రెడ్డి, గోనె శ్రీనివాస్, బల్యాల సుదర్శన్, కల్లూరి సిద్ధ రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed