రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప మాలధారణ స్వామి మృతి

by Sridhar Babu |
రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప మాలధారణ స్వామి మృతి
X

దిశ,నిజాంసాగర్ : లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఓ అయ్యప్ప మాలధారణ స్వామి మృతి చెందగా మరో ఐదుగురు స్వాములకు తీవ్ర గాయాలైనా ఘటన బుధవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని చర్చి వద్ద ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. నిజాం సాగర్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మాసానిపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు అయ్యప్ప మాలధారణ స్వాములు మాసానిపల్లి గ్రామం నుండి ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామంలో జరిగిన అయ్యప్ప స్వాముల

దీక్షకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ అతివేగంగా ఢీ కొట్టింది. దాంతో ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న ఎంబరి కాశయ్య (55) అనే స్వామి అక్కడికక్కడే మృతి చెందారు. పుల్లూరి విటల్ అనే మరో స్వామికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఉప్పరి సాయిలు, అంజయ్య, మంగలి లింగం, చినురి అనిల్ అనే స్వాములను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు ఎస్​ఐ తెలిపారు. కాగా ఆటోను ఢీ కొట్టిన లారీ డ్రైవర్ లారీని వదిలిపెట్టి పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story