పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై దాడులు

by Sridhar Babu |
పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై దాడులు
X

దిశ ,నిజామాబాద్ క్రైం : శుక్రవారం మోపాల్ మండలంలోని కంజర్ ,కులస్ పూర్ గ్రామాలలో అక్రమంగా ప్రజాపంపిణీ బియ్యం కొనుగోలు చేసి నిల్వ ఉంచిన విషయమై విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లయీస్ ఇన్స్పెక్టరు, మొపాల్ సబ్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కంజర్ గ్రామంలో 18.48 క్వింటాళ్లు, కులాస్ పూర్ లో 11.13 క్వింటాళ్ల బియ్యం స్వాధీనపరుచుకుని సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. పట్టుకున్న బియ్యాన్ని సంబంధిత గ్రామాల చౌకధరల దుకాణాల డీలర్లకు భద్రత నిమిత్తము అప్పగించినట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్రప్రకాష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed