- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- భక్తి
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రజాకర్షక పాలన అందిస్తారు
దిశ, భిక్కనూరు : తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ గా కష్టపడి పని చేసి పార్టీని అధికారంలోకి తెచ్చాడని, అటువంటి నాయకుని సేవలు గుర్తించి అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి సమర్థుడని, అటువంటి నాయకుని నాయకత్వంలో ప్రజాకర్షక పాలన అందిస్తాడన్న నమ్మకాన్ని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డిని ప్రకటించడం పట్ల ఏఐసీసీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాణిక్ రావు ఠాక్రే, డీకే శివకుమార్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో భిక్కనూరు ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, భిక్కనూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపరి భీమ్ రెడ్డి, అంకం రాజు తదితరులు పాల్గొన్నారు.