ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాలలను రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా

by Sridhar Babu |
ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాలలను రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో జాంబీ హనుమాన్ వద్ద గల బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాఠశాలలో నూతనంగా నిర్మించిన వేదిక, భోజనశాల గది, ఇతర గదులను బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గా గెలిచినప్పటి నుండి ఈ పాఠశాలను తెలంగాణలో మోడల్ గా చేయాలి అని అనుకున్నట్టు తెలిపారు. బాలికలకు బాత్రూమ్ లు లేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఇక నుండి పాఠశాలల్లో చదువుకునే బాలికలకు బాత్రూంల ఇబ్బంది ఉండకూడదు అని యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

విద్యార్థులు కూడా శుభ్రతతో ఉండాలని, చెట్లు పెంచే బాధ్యత తీసుకోవాలని కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వసంత పంచమి వేడుకల్లో పాఠశాల ఆవరణలో పాల్గొని సరస్వతి దేవికి ప్రత్యేకంగా పూజలు చేశారు. సరస్వతీ కృపతో విద్యార్థులందరూ మంచిగా చదువుకోవాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, బీజేవైఎం నాయకుడు మందుల బాలు, నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story