అక్రమ నిర్మాణ పనులను అడ్డుకున్న నాయకులు

by Sumithra |
అక్రమ నిర్మాణ పనులను అడ్డుకున్న నాయకులు
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఏరియాలో గల మున్సిపల్ 24వ వార్డులో 10 శాతం మున్సిపల్ స్థలంలోంచి సుమారు 100 గజాల స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా ఇంటిని నిర్మిస్తుండడంతో బీజేపీ ఆర్మూర్ పట్టణ నాయకులు బుధవారం నిర్మాణ పనులను అడ్డుకున్నారు. మున్సిపల్ స్థలంలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్న ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ దృష్టికి బీజేపీ నాయకులు తీసుకెళ్లారు.

ఆర్మూర్ మున్సిపల్ లో అక్రమ కట్టడాలను ఆపి మున్సిపల్ శాతం స్థలాలను ప్రజల అవసరాల రీత్యా కాపాడాలని బీజేపీ నాయకులు కోరారు. మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవి.నరసింహారెడ్డి, బీజేపీ నాయకులు కాందేష్ ప్రశాంత్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed