పారిశుధ్య కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటా: ఎమ్మెల్యే సూర్యనారాయణ

by Mahesh |
పారిశుధ్య కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటా: ఎమ్మెల్యే సూర్యనారాయణ
X

దిశ, నిజామాబాద్ సిటీ: పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ అండగా ఉంటారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. అదే విధంగా విధుల్లో నిర్లక్ష్యం చేసే మున్సిపల్ అధికారులు ఇతర సిబ్బంది తప్పు చేస్తే సహించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని దుబ్బ, నాందేవాడ 36వ డివిజన్ లో ఉన్న జోన్ -1 పారిశుద్ధ్య వార్డు ను ఉదయం 5 గంటలకు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు రికార్డు, మున్సిపల్ బిల్స్ తదితర రికార్డ్స్ లను పరిశీలించిన అనంతరం 43,36 డివిజన్ లో పర్యటించి కార్మికుల పనితీరు, డ్రైనేజ్ చెత్త సేకరణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాందేవాడ జోన్ -1 పారిశుద్ధ వార్డ్‌లో మొత్తం కార్మికులు 180 పైన ఉన్నారని, ఈ రోజు 126 మంది హాజరు శాతం రికార్డ్స్ లో ఉందని తెలియజేసారు. మిగతా వార్డ్స్ కూడా త్వరలో తనిఖీ చేస్తానని శానిటేషన్ విషయంలో కార్మికులు, అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలనీ, నగరంలో ఉన్న ప్రతి కాలనీ ని పరిశుభ్రంగా చేసే బాధ్యత మనపైన ఉందని ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి పరిశుభ్రత చాలా ముఖ్యం అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్,వార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed