సాయి ప్రియ వెంచర్ అంత అక్రమమే...!

by Aamani |
సాయి ప్రియ వెంచర్ అంత అక్రమమే...!
X

దిశ,రంగారెడ్డి బ్యూరో /మహేశ్వరం: మహేశ్వరం మండలం లో ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న చెరువులు, కుంటలు,వాగులు రోజురోజుకు మాయమైపోతున్నాయి. తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 144 లో తిమ్మాయి చెరువు( మఖ్త చెరువు, తిమ్మాయి చెరువు,తిమ్మాజీ చెరువు)శిఖం సర్కారీ 34.05 ఎకరాలు భూమి ఉంది. తిమ్మాయి చెరువు ప్రక్కనే 145,148,149 సర్వే నంబర్లల్లో చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది.హెచ్ఏండీఏ సూచించిన మ్యాప్ లో, ధరణిలో చూసిన తిమ్మాయి చెరువు ఎఫ్ టిఎల్ పరిధి కంటికి స్పష్టంగా కనిపిస్తుందని గ్రామస్థులు తెలుపుతున్నారు.కానీ ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులకు145,148,149 సర్వే నంబర్ లలో ఎఫ్ టిఎల్ పరిధిలో చెరువు ఉందాన్ని అధికారులకు కనిపించకపోవడం వెనుక అంతర్యం ఏదో దాగి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తిమ్మాయి చెరువు పూర్తి ఎఫ్ టిఎల్ పరిధిని నిర్ధారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.తిమ్మాయి చెరువు పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

లావాణి భూమి ఆక్రమణ...?

సాయి ప్రియ వెంచర్ పక్కనే సర్వే నెంబర్ లో 137 లావాణి భూమి ఉంది.వెంచర్ నిర్మాణం చేసే క్రమంలో లావాణి భూమిని సాయి ప్రియ వెంచర్ నిర్వాహకులు కొంత హద్దు భాగం ఆక్రమించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

రికార్డులో అవకతవకలు..

సర్వే నంబర్ 145 లో 1976 వరకు తిమ్మాజీ చెరువు(మఖ్త చెరువు, తిమ్మాయి చెరువు)సెరుబా ఇనామ్(దస్తు గర్దాన్ ఇనాం భూమి (ఉర్దూ పదం) అప్పటి పహాణి లో ఉంది.తిమ్మాజీ చెరువు దస్తుగర్ధాన్ ఇనామ్ భూమికి ఓఆర్సీ ఏ విధంగా జారీ చేశారు.ఇనాం చట్ట ప్రకారం ఓఆర్సీని జారీ చేయాలంటే వాస్తవ ఇనామ్ దారులకు,వారసత్వంగా వారి కుటుంబ సభ్యులకు,అనుభవదారులకు, కౌలుదారులకు ఓఆర్సీని జారీ చేయాలి.కానీ చెరువు ఇనాం భూమికి ఏ విధంగా ఓఆర్సీని జారీ చేశారో రెవెన్యూ అధికారులే తెలపాలి.

ఇనాం భూములను ఎసరు..

కుల వృత్తులకు,కవులకు,ఇతరత్రా సేవాలను గుర్తుంచి బహుమతి (దానం) కింద ఇచ్చే భూములను ఇనాం భూములు అంటారు. సాయిప్రియ వెంచర్ పూర్తిగా 145,146,147,148,149,150 దస్తుగర్ధాన్ ఇనామ్ భూముల్లో ఉంది (1955-1995). ఇనాం దారులకు,సాగుదారు కాలంలో ఉన్న అనుభవదారులకు ఓఆర్సీలు జారీ కాలేదు.దస్తుగార్ధన్ లో అక్రమంగా ఓఆర్సిలు జారీ అయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.మరో ప్రక్క ఇనాం దారుల,అనుభవదారుల పేర్ల మీద కాకుండా ఇతర వ్యక్తుల పేరు ఓఆర్సీలు జారీ అయ్యాయి.సాయి ప్రియ వెంచర్ నిర్వాహకులు ఇనాం భూములను కొనుగోలు చేశారని గ్రామస్తులు పేర్కొంటున్నారు.వెంచర్ చేసే క్రమంలో తుమ్మలూరు గ్రామానికి చెందిన రాజకీయంగా పలుకుబడి ఉన్న పెద్ద మనుషులు దస్తుగర్ధన్ లో పట్టాదారులతో, అనుభవదారులతో సంతకాలు పెట్టించి వెంచర్ నిర్వాహకులకు అండగా నిలిచి అమాయకులను మోసం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇరిగేషన్ ,రెవిన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం..?

మహేశ్వరం మండలం లో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని పలుమార్లు ఇరిగేషన్,రెవెన్యూ శాఖ అధికారులకు విన్నపించిన అధికారుల నుంచి ఎటువంటి స్పందన రావడంలేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబ్జాలకు గురైన చెరువులపై ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని మహేశ్వరం మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed