కాంగ్రెస్ హయాంలో అన్ని పండుగలకు ప్రాధాన్యత

by Sridhar Babu |
కాంగ్రెస్ హయాంలో అన్ని పండుగలకు ప్రాధాన్యత
X

దిశ, నిజామాబాద్ రూరల్ : కాంగ్రెస్ హయాంలో అన్ని పండుగలకు ప్రాధాన్యత ఇస్తామని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి అన్నారు. గెలిచిన తరువాత మొదటి సారి సోమవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డివిజన్ 1 ఖానాపూర్ గ్రామంలో బీరప్ప కల్యాణ మహోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కురుమ, గొల్ల సంఘం వారు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అన్ని కులాలకు తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు.

కల్యాణ మహోత్సవంలో పాల్గొనటం సంతోషంగా ఉందని అన్నారు. రూరల్ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రజలకు సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగా రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రూరల్ డివిజన్ కార్పొరేషన్ అధ్యక్షులు కొర్వ రాజేంద్రప్రసాద్, రాజలింగం, ఉష, బొంశెట్టి శ్రీనివాస్, భోజన్న, మహేందర్, నరేష్, వీరేందర్, గ్రామ విలేజ్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed