Accident : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..

by Sumithra |
Accident : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..
X

దిశ, కామారెడ్డి : విధుల్లో భాగంగా వెళ్తున్న ఓ యువకుడి బైక్ ను వెనుక నుంచి ఓ ట్రక్కు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సదాశివనగర్ మండలం కుప్రియాల్ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామానికి చెందిన కట్ల ఆనంద్ (29) ఓ కంపెనీలో కొరియర్ బాయ్ గా పని చేస్తున్నాడు.

విధుల్లో భాగంగా బైక్ పై కొరియర్ ఇవ్వడానికి వెళ్తుండగా సదాశివనగర్ మండలం కుప్రియాల్ శివారులో ఆనంద్ వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed