రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by Sridhar Babu |
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
X

దిశ, గాంధారి : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన కడం విక్రమ్ గౌడ్ (19) శనివారం రాత్రి అతని స్నేహితుడైన కుమ్మరి లింగమేశ్వర్ పుట్టినరోజు వేడుకలు ఉన్నాయని మరొక స్నేహితుడైన సునుగురు సందీప్ బైక్ పై వెళ్లాడు. పుట్టినరోజు వేడుకలు ముగించుకున్న తర్వాత తిరిగి తన ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో గాంధారి గ్రామపంచాయతీ వద్దకు రాగానే అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టాడు. దాంతో వెనకాల కూర్చున్న విక్రం గౌడ్ ఎగిరి రోడ్డు పైన పడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయినాడు. మృతుని తండ్రి నారా గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed