నాటు బాంబు పేలి మహిళకు తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

by Mahesh |
నాటు బాంబు పేలి మహిళకు తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
X

దిశ, మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో అడవి జంతువుల వేట కోసం ఇంట్లో దాచి ఉంచిన నాటు బాంబు పేలి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన హైదరాబాద్ కు అత్యవసర చికిత్స కోసం తరలించారు. నాటు బాంబు పేలుడు ధాటికి ఇల్లు అంతర్భాగం పాక్షికంగా ధ్వంసమైంది. శిరీష భర్త రవీందర్ అటవీ జంతువుల వేట కోసం నాటు బాంబులను దాచి ఉంచినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed