- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
మద్యానికి బానిసై గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని ధర్మారెడ్డి తండా గ్రామానికి చెందిన కాట్రోత్ శ్రీకాంత్ (31) అనే వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్సై రాజు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ధర్మారెడ్డి తండా కు చెందిన శ్రీకాంత్ కు గత కొన్ని రోజుల క్రితం మెదక్ కు చెందిన నుంసావత్ దీపికతో ప్రేమ వివాహం జరిగింది. అనంతరం వీరి కాపురంలో జరిగిన చిన్న చిన్న తగాదాల
వల్ల శ్రీకాంత్ అతిగా మద్యానికి బానిసై ఈనెల 1వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. గతంలో కూడా ఇలాగే గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఇతని మాట ఎవరూ నమ్మలేదు. రెండు రోజుల తరువాత చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించి అనంతరం ఇంటికి తీసుకురాగా మృతి చెందాడు. మృతుని అన్న కాట్రోత్ సర్వన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.