ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

by Sridhar Babu |
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
X

దిశ,నిజాంసాగర్ : ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కె. సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లూరు గ్రామానికి చెందిన పట్నం సాయిలు (33) రోజు మాదిరిగా శనివారం ఊర చెరువులో కాలకృత్యాలకు వెళ్లగా కాలు జారి నీటిలో పడి ఈత రాక మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి చిన్నాన్న కుమారుడు పట్నం సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed