మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి

by Sridhar Babu |
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
X

దిశ, మాచారెడ్డి : మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మద్యం ప్రియుడు రోడ్డు పక్కన గల పొలంలో బోర్లా పడిపోయి మృతి చెందిన ఘటన మాచారెడ్డి ఉమ్మడి మండలం భవాని పేట గ్రామ శివారులో చోటు చేసుకుంది. మృతుడు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దోసెలగూడెం గ్రామానికి చెందిన టేకుమల్ల కిషన్ (39) గా గుర్తించారు.

మృతుని తమ్ముడు టేకుమల్ల చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం మృతునికి వివాహం కానందున మద్యానికి బానిసై తిరుగుతుంటాడు. ముత్యంపేట గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్తానని చెప్పి రాత్రి నడుచుకుంటూ వెళ్తూ పొలంలో పడి మృతి చెందినట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed