రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |   ( Updated:2024-02-05 15:23:11.0  )
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ నెంబర్ 2 ట్రాక్ పైన ఒక గుర్తు తెలియని వ్యక్తి ( 40 ) బాసర నుంచి హైద్రాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుని వివరాలు తెలిస్తే రైల్వే ఎస్ ఐ సాయిరెడ్డి 8712658591 కు తెలియచేయాలని రైల్వే పోలీస్ లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed