బీజేపీలో చేరిన పసుపు బోర్డు ఉద్యమనేత

by Disha Web Desk 12 |
బీజేపీలో చేరిన పసుపు బోర్డు ఉద్యమనేత
X

దిశ, ఆర్మూర్ : బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రైతు నాయకుడు, గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిజామాబాద్ జిల్లా లోని ఆర్మూర్ ప్రాంతానికి చెందిన కోటపాటి నరసింహనాయుడు బీజేపీలో చేరారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని నాంపల్లి లో గల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు.

పసుపు బోర్డు ఏర్పాటు కోసం రైతుల్లో ఉద్యమ నేతగా ఎదిగిన కోటపాటి నరసింహనాయుడు చేరికతో భారతీయ జనతా పార్టీకి అదనపు బలం చేకూరి నట్లయింది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నతికి ఎన్ని సేవలు చేసిన గుర్తింపు లేకపోవడంతో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కి ఇటీవల రాజీనామా లేఖను రాసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో, దేశంలో పసుపు రైతుల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోడి పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు నిజామాబాద్‌లో ప్రకటించి, కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గం ద్వారా గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీలో చేరినట్లు కోటపాటి నరసింహనాయుడు దిశతో వివరించారు.



Next Story

Most Viewed