దేవి ఊరేగింపులో కత్తిపోట్ల కలకలం

by Naveena |
దేవి ఊరేగింపులో కత్తిపోట్ల కలకలం
X

దిశ,ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో కత్తిపోట్ల ఘటన స్థానికంగా కలకలం రేపింది. మామిడిపల్లి విద్యానగర్ కాలనీలోని దుర్గామాత మండపం వద్ద గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు కత్తి తో దాడి చేసుకున్నారు. వరుణ్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిసింది. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి నిమజ్జన కార్యక్రమంలో జరుగుతున్న ఉత్సవ ఊరేగింపులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఒక అమ్మాయి విషయంలో జరిగిన గొడవలో ఇరువురు యువకులు గొడవ పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయితో ఇదివరకే నిశ్చితార్థమైన అబ్బాయి వరుణ్ అనే మరో యువకునిపై కత్తితో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘర్షణలో ఒకరు కత్తిపోట్లతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కత్తిపోట్లకు గురైన యువకుడు ఆర్మూర్ లోని మెకానిక్ షెడ్ లో మెకానిక్ గా పని చేస్తున్నాడు.

Next Story

Most Viewed