మల్కాపూర్ శివారులో చిరుత సంచారం

by Kalyani |
మల్కాపూర్ శివారులో చిరుత సంచారం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ మండలం గుండారం - మల్కాపూర్ గ్రామాల శివారులో కొద్ది రోజులుగా చిరుతపులి సంచరిస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మల్కాపూర్ శివారులో మేక పై చిరుత దాడి చేసి చంపడం కలకలం సృష్టించింది. ఘటనా స్థలం వద్ద చిరుత పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తుండటంతో ప్రజలు మరింతగా భయపడుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి చిరుత ఎవరిపై దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు గ్రామస్థులు. స్థానికులు చిరుత గురించి సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు చేరవేయడంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంజీవ్ గౌడ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Advertisement

Next Story

Most Viewed