England-Australia: ఇంగ్లండ్​పై ఐదో వ‌న్డేలో ఆసీస్ ఘన విజయం..3-2తో వన్డే సిరీస్ కైవసం

by Maddikunta Saikiran |
England-Australia: ఇంగ్లండ్​పై ఐదో వ‌న్డేలో ఆసీస్ ఘన విజయం..3-2తో వన్డే సిరీస్ కైవసం
X

దిశ, వెబ్‌డెస్క్:ఇంగ్లండ్(England)- ఆస్ట్రేలియా(Australia) మధ్య బ్రిస్టల్(Bristol) వేదికగా ఆదివారం జ‌రిగిన ఐదో వ‌న్డేలో ఆసీస్ విజ‌యాన్ని న‌మోదు చేసింది.దీంతో 5 వన్డేల సిరీస్ ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచులో ఆసీస్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.2 ఓవర్లలలో 309 పరుగులకు ఆలౌట్ అయ్యింది.ఇంగ్లండ్ తరుపున ఓపెనర్ బెన్ డకెట్(Ben Duckett) సెంచరీతో ఆకట్టుకోగా,కెప్టెన్ బ్రూక్(Brook) 72 పరుగులు చేశాడు.ఆ త‌ర్వాత 310 పరుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా 20.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 165 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు కాసేపు మ్యాచును నిలిపివేశారు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్-లూయిస్ (Duckworth–Lewis) పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా విజయం సాధించినట్టు అంపైర్లు ప్రకటించారు.కంగారూల తరుపున అత్యధికంగా మాథ్యూ షార్ట్(Matthew Short) 58 పరుగులు చేయగా,స్టీవ్ స్మిత్(Steve Smith) 36 పరుగులు,హెడ్(Head) 31 పరుగులు చేశారు. ఈ మ్యాచులో అల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ట్రావిస్ హెడ్ కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. కాగా ఇరుజట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్ 1-1తో సమమైన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed