Women’s T20 WC : రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ.. వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ విజయం

by Harish |
Women’s T20 WC : రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ.. వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : మహిళల టీ20 వరల్డ్ కప్‌ వార్మప్ మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. దుబాయ్ వేదికగా జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 141/8 స్కోరు చేసింది. షెఫాలీ వర్మ(7), స్మృతి మంధాన(14), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(1), రిచా గోష్(7) నిరాశపరచగా.. జెమిమా రోడ్రిగ్స్(52) హాఫ్ సెంచరీతో రాణించింది. యాస్తికా భాటియా(24) కీలక పరుగులు జోడించింది. విండీస్ బౌలర్లలో కెప్టెన్ హేలీ మాథ్యూస్(4/17) సత్తాచాటింది. అనంతరం భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఛేదనలో వెస్టిండీస్ 121/8 స్కోరుకే పరిమితమైంది. చినెల్లె హెన్రీ(59 నాటౌట్) చివరి వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్(3/20), దీప్తి శర్మ(2/11) విండీస్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. మంగళవారం రెండో వార్మప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో హర్మన్‌ప్రీత్ సేన తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed