ఇద్దరు లెక్చరర్లపై కేసు నమోదు

by Sridhar Babu |   ( Updated:2024-03-02 14:07:09.0  )
ఇద్దరు లెక్చరర్లపై కేసు నమోదు
X

దిశ, కామారెడ్డి : సదాశివనగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కాపీయింగ్ చేయించేందుకు విఫల యత్నం చేసిన ఇద్దరు జూనియర్ కళాశాల లెక్చరర్స్ పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సదాశివ్ నగర్ సీఐ సంతోష్ కుమార్, సదాశివనగర్ ఎస్సై రాజు తెలిపిన వివరాల మేరకు గత నెల 29న ఉదయం 11:15 గంటలకు సదాశివ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరిసర ప్రాంతంలో ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతున్న సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా

అక్కడ ఒక వ్యక్తి ఒక బ్యాగ్ తో అనుమానాస్పదంగా తిరుగుతూ పెట్రోలింగ్ సిబ్బందిని చూసి బ్యాగ్ అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ విషయం పై పోలీసులు తదుపరి విచారణ చేయగా లెక్చరర్స్ ఎండీ ఇశ్రత్ (హిందీ లెక్చరర్), బి.రంజిత్ (కెమిస్ట్రీ లెక్చరర్)లు హిందీ పరీక్ష జరుగుతుండగా కాఫీయింగ్ కోసం కొన్ని చిట్టీలను పరీక్ష సెంటర్ల లో ఉన్న రంజిత్ కి పంపించి కాపీయింగ్ చేయించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ పోలీస్ కానిస్టేబుల్ కనిపించడంతో వారి ప్రయత్నం విఫలమై చిట్టీలు ఉన్న బ్యాగ్ ని బయట ఇశ్రత్ వదిలి వెళ్లిపోయాడు. కాగా వీరిద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story