రూ.4 లక్షల 80 వేల నగదు పట్టివేత

by Sridhar Babu |
రూ.4 లక్షల 80 వేల నగదు పట్టివేత
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం సాయంత్రం నగరంలోని కుమార్ గల్లీలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని పట్టుకుని విచారించడంతో అతని వద్ద 4 లక్షల 80 వేల నగదు పట్టుబడిందని ఎస్హెచ్ఓ తెలిపారు. నగరంలోని వినాయక నగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన శివ ప్రసాద్ అనే వ్యక్తి వద్ద ఈ నగదు దొరికిందని విజయబాబు తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా 50 వేలకు మించిన నగదు ఉండడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

Next Story