రూ.2.71 లక్షలు సీజ్

by Sridhar Babu |
రూ.2.71 లక్షలు సీజ్
X

దిశ, మాచారెడ్డి : రూ. 2.71 లక్షలను సీజ్ చేసినట్లు మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం ఉదయం 5 గంటలకు అంతర్ జిల్లా ఘన్పూర్ చౌరస్తా వద్ద పార్లమెంటు సాధారణ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఎస్ ఎస్టీ అధికారి విద్యాసాగర్ రావు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేయగా రూ. 2, 71 వేలు లభించాయి. సరైన పత్రాలు లేనందున ఆ డబ్బులను సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రయాణికులు ఎవరైనా సరైన ద్రువ పత్రాలు లేకుండా రూ. 50 వేలకు మించి తీసుకొని వెళ్ల వద్దని వివరించారు.

Advertisement

Next Story