NDA MEETING : మోడీ పాలనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Rajesh |
NDA MEETING : మోడీ పాలనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్డీయే ఎంపీల సమావేశంలో టీడీపీ చీఫ్, ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు కీలకవ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడానికి మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారన్నారు. ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచి చివరి వరకు మోడీ కష్టపడ్డారని గుర్తు చేశారు. ఏపీలోనూ మూడు బహిరంగ సభలు ర్యాలీల్లో మోడీ పాల్గొన్నారని స్పష్టం చేశారు. మోడీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ వన్ గా నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. అంతకుముందు ఎన్డీయే పక్ష నేతగా మోడీని రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించారు. రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదనను అమిత్ షా, గడ్కరీ, చంద్రబాబు, కుమారస్వామి బలపర్చారు.

Advertisement

Next Story

Most Viewed