- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
కేసీఆర్, జగన్ ఇద్దరి ఓటమికి కారణం అదే: CPI నారాయణ
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్లపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల నిరసనలను జగన్ పట్టించుకోలేదని.. ఎన్నికల్లో ఆయన ఓటమికి కారణం అదేనని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ధరణి స్కీమ్తో పతనమైతే.. ఆంధ్రప్రదేశ్లో భూరక్షణ పథకంతో జగన్ ప్రభుత్వం పడిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులను, భూముల సమ్యలను పట్టించుకోకపోవడమే వీరిద్దరి ఓటమికి కారణమని నారాయణ అభిప్రాయపడ్డారు.
ఇక, ఎన్నికల్లో ఘన విజయం సాధించి నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు ఈ సందర్భంగా నారాయణ అభినందనలు తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో జగన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఇక, తెలంగాణలో గతేడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది.