నా గెలుపునకు సహకరించండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేను కలిసిన తీన్మార్ మల్లన్న

by Disha Web Desk 9 |
నా గెలుపునకు సహకరించండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేను కలిసిన తీన్మార్ మల్లన్న
X

దిశ, నకిరేకల్ టౌన్: నల్లగొండ- ఖమ్మం- వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియామకమైన తీన్మార్ మల్లన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావులను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన గెలుపునకు సహకరించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిస్తే ప్రజల గొంతుకై పోరాడుతానన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీ రావాలన్నారు. గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లతో ఓడిపోయానని డబ్బులతో మాత్రమే ఓడించారన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. అనునిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం తనదన్నారు. త్వరలో ప్రచార కార్యక్రమాన్ని చేపడతానని అందులో భాగంగా నకిరేకల్ నియోజకవర్గంలోనూ ప్రచారం నిర్వహిస్తాని తెలిపారు. అనంతరం శాలువాలతో వేముల, నేతి విద్యాసాగర్ రావు లను సన్మానించారు.



Next Story