మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ

by Naveena |
మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ
X

దిశ నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నికైన చౌగొని రజిత శ్రీనివాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం శాలువాతో.. సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నకిరేకల్ మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా మార్చితాం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఏ సమస్య ఉన్న తాను అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తానని వెల్లడించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పాలన బాగుందన్నారు. అభివృద్ధిని పట్టించుకోకుండా కొంతమంది అనవసర రాద్ధాంతాలు చేయడం మంచిది కాదన్నారు. అభివృద్ధి జరుగుతుంటే అనవసరంగా ప్రజలను కార్యకర్తలను రెచ్చగొట్టడం మంచిది కాదన్నారు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రజితకు కౌన్సిలర్లు సన్మానాలు చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story