నాగార్జునసాగర్‌కు పెరిగిన వరద.. 22 గేట్లు ఓపెన్‌

by Nagam Mallesh |
నాగార్జునసాగర్‌కు పెరిగిన వరద.. 22 గేట్లు ఓపెన్‌
X

దిశ:నాగార్జునసాగర్ః నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు 22 గేట్లను 5ఫీట్ల మేరకు ఎత్తి నీటిని పులిచింతలకు, దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన శ్రీశైలం నుండి నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు 22 క్రష్ట్‌ గేట్లను 5అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు క్రెస్ట్ గేట్లు ద్వారా 178200 విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి సాగర్‌ జలాశయానికి 2.27,329 క్యూసెక్కుల వరద వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 590 అడుగులవద్ద నీరు నిల్వవుంది. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 312.0450 టీఎంసీల నిల్వ ఉంది. జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేపడుతూ 29,394 క్యూసెక్కులను, కుడి కాల్వ ద్వారా 9160 క్యూసెక్కులను, ఎడమ కాల్వ ద్వారా 8280 క్యూసెక్కులను, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1800 క్యూసెక్కులను, లో లెవల్‌ కెనాల్‌ ద్వారా 600 క్యూసెక్కులను, మొత్తంగా 2.27,329 క్యూసెక్కులను వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు.

Next Story

Most Viewed