ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ

by Kalyani |
ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ లోని ఎయిమ్స్ ఆసుపత్రిని శనివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్, ప్రయోగశాలలను పరిశీలించారు. వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ తిరిగి చూశారు. మెడికల్ కాలేజ్ పరిపాలన హాస్పిటల్స్ సర్వీసెస్ అకాడమిక్స్ గురించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా. వికాస్ బాటియా ను అడిగి తెలుసుకున్నారు.

బయటి రోగుల విభాగంలోకి వెళ్లి వారితో మాట్లాడారు హాస్పిటల్ అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. భవనాల నిర్మాణాలను పరిశీలించి ఎయిమ్స్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు రిక్రూట్మెంట్ చేసుకునే విధానం అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు కావలసిన నిధుల గురించి రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి , యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే, హాస్పిటల్స్ సూపర్డెంట్ డా. లక్కి రెడ్డి, బీబీ నగర్ మండల ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Next Story