- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులపై దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్
![పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులపై దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులపై దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్](https://www.dishadaily.com/h-upload/2024/07/01/348013-35.webp)
దిశ, మెదక్ ప్రతినిధి : పెండింగ్ లో ఉన్న ప్రజావాణి సమస్యలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు తో కలిసి ప్రజావాణి లో వివిధ సమస్యలపై ప్రజలు అందిన దరఖాస్తులు స్వీకరించి పెండింగ్ లో ఉన్న ప్రజావాణి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పాలనలో ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రధాన ధ్యేయమని తమ పరిధిలో ఉన్న సమస్యలను ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పరిశీలించడం జరుగుతుందని లేనిపక్షంలో పరిష్కారం కాని సమస్యపై లబ్ధిదారులకు అర్థమయ్యే రీతిలో అవగాహన చేయాలని అన్నారు. ప్రజావాణిలో భూ సంబంధిత సమస్యల పై 53, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 17, పింఛన్లు కావాలని 36, ఉపాధి ఉద్యోగ అవకాశాలు 5, ఇతర సమస్యలు-96 మొత్తంగా 197 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.