బీఆర్ఎస్ పార్టీకి పలువురు నాయకులు రాజీనామా

by Disha Web Desk 15 |
బీఆర్ఎస్ పార్టీకి పలువురు నాయకులు రాజీనామా
X

దిశ, వేములపల్లి : వేములపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం రాజీనామా అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధి కోసం పని చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలకు హాజరుకానున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినవారిలో వేములపల్లి జెడ్పీటీసీ ఇరుగు మంగమ్మ వెంకటయ్య, రైతు సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఇరుగుదిండ్ల పద్మ గోవిందు, మాజీ సర్పంచులు దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి, అంకెపాక రాజు, పీఏసీఎస్ డైరెక్టర్లు గొట్టే సైదులు, బంటు నాగమ్మ సైదులు, కోడిరెక్క శంభులింగం, చింతకాయల వీరేందర్, నిడుకొండ రామచంద్ర(చందు), వంగూరి వెంకటయ్య, ఇరుగుదిండ్ల రాజు తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed