MLA Kumbham : జిట్టాను నిలువెత్తున మోసం చేసింది కేసీఆర్

by Kalyani |
MLA Kumbham : జిట్టాను నిలువెత్తున మోసం చేసింది కేసీఆర్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : జిట్టాను నిలువెత్తున మోసం చేసింది కేసీఆర్ అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ విమర్శించారు. భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద జిట్టా బాలకృష్ణా రెడ్డి మృతి పట్ల భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిట్టా తన సొంత ఆస్తులను అమ్ముకొని ప్రజల కోసం అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించిన గొప్ప వ్యక్తి జిట్టా అని అన్నారు.

జిట్టా బాలకృష్ణ రెడ్డి కి అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. మొట్టమొదటి తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆస్తులు అమ్ముకుని బీఆర్ఎస్ పార్టీ కోసం ఖర్చులు పెట్టారని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అందించిన నాయకుడు జిట్టా బాలకృష్ణ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సముచిత స్థానం ఇవ్వలేదన్నారు. జిల్లాలో ఏదైనా అధికారిక భవనానికి జిట్టా బాలకృష్ణారెడ్డిని పేరును ప్రతిపాదిస్తామన్నారు.‌ కేవలం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ స్వార్థ రాజకీయాలతో జిట్టా బాలకృష్ణారెడ్డిని రాజకీయంగా ఎదగకుండా చేశారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed