- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
పల్లెల్లో.. బెల్ట్ దందా...!
![పల్లెల్లో.. బెల్ట్ దందా...! పల్లెల్లో.. బెల్ట్ దందా...!](https://www.dishadaily.com/h-upload/2024/06/29/347293-7.webp)
దిశ, నాగారం: మండల పరిధిలో ప్రతి పల్లెలో బెల్ట్ దందా జోరుగా సాగుతోంది. పల్లెలో మారుమూల తండాల్లో గ్రామాల్లో మత్తులో జోగుతున్నాయి. గ్రామాల్లో పుట్టగొడుగుల బెల్ట్ దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అనేకమంది బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధిన పాలవుతున్నారు. నాగారం మండల పరిధిలో పలు గ్రామాల్లో బహిరంగంగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి.
అనుమతి పొందిన వైన్ షాప్ లో నుంచే వందల సంఖ్యలో మద్యం బాటిల్ బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు కొనసాగుతూ ఉంటే నిరోధించాల్సిన సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు ఒకవైపు గుడుంబా మానేసిన వారికి ప్రభుత్వం స్వయం ఉపాధి మార్గాలతో జీవనం ఉపాధి కల్పిస్తుంటే మరోవైపు బెల్ షాపులు పల్లె ప్రజలను మత్తులో ముంచుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదని బహిరంగంగా ప్రజల ఆరోపిస్తున్నారు.
పచ్చని సంసారాల్లో చిచ్చు
మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంది. ఊరు ఊరు బెల్ట్ షాపులు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి. దీంతో పొద్దంతా పనిచేసే సంపాదించిన సొమ్మును మద్యానికి విచ్చేస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు నిర్వహించడంతో యువత పెడదారి పడుతున్నారు.
పేరుకే కిరాణం అమ్మేది మధ్యమే.!
అనేకమంది పేరుకే కిరాణం దుకాణం నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. సొంత ఇళ్లలో పెద్ద ఫ్రిజ్ లో పెట్టుకొని విక్రయిస్తున్నారు. మద్యం మత్తులో ఇళ్ల మధ్యలో గొడవలు పెడుతూ అర్థరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు నిద్ర మత్తు వీడి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.