- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
మత్స్యకారుల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం: ఎమ్మెల్యే కుంభం అనిల్
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం బీబీనగర్ చెరువులో రాష్ట్ర ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్తో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని మత్స్యకారుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పని చేస్తుందని అన్నారు. బునాధి కాలువ అభివృద్ధి కోసం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవడం జరిగిందన్నారు. త్వరలోనే కాలువ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. నిధులు మంజూరు కానుండడంతో బునాదిగాని కాలువ ఆయకట్టు రైతుల పక్షాన బీబీనగర్ మండల కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.