మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డు కు డాక్టర్ కోడి శ్రీనివాసులు ఎంపిక

by Kalyani |
మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డు కు డాక్టర్ కోడి శ్రీనివాసులు ఎంపిక
X

దిశ,చండూరు : గాంధీజీ ఫౌండేషన్, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డు 2024 కు ఎంపికయ్యారు. ఈ నెల 22వ తేదీ మంగళవారం రోజు హైదరాబాదులోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో ఆయనకు అవార్డు అందజేయనున్నారు. అవార్డు ప్రధాన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, దయానందులు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, రిటైర్డ్ జడ్జ్ చంద్రకుమార్, గోపిశెట్టి నిరంజన్, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షులు రాజనారాయణ్ లు పాల్గొంటారని తెలిపారు. డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ…గాంధీజీ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను ఈ అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది అన్నారు.

Advertisement

Next Story

Most Viewed