అమ్మబాబోయ్..బిర్యానీలో పురుగు

by Naveena |
అమ్మబాబోయ్..బిర్యానీలో పురుగు
X

దిశ, యాదాద్రి :మీరు బిర్యాని తినాలనుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త. నిజమే.. బిర్యానీ తినేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే.. ఖంగుతినే ఛాన్స్ ఉంది.ఓ వ్యక్తి బిర్యానీ తింటుండగా పురుగు వచ్చిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం సృష్టించింది. దీంతో బిర్యానీలో పురుగు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న వివేరా హోటల్ లో ఓ వ్యక్తి బిర్యానీ ఆర్డర్ చేయగా..అందులో పురుగు వచ్చింది. గమనించిన వ్యక్తి హోటల్ సిబ్బందిని నిలదీశాడు. హోటల్ యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో హోటల్ సిబ్బంది అతన్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఇది పాత వీడియో అని,ఫేక్ వీడియో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బిర్యానీలో పురుగు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బిర్యానీ ఆర్డర్ చేసిన వ్యక్తి మాత్రం నాకేం సంబంధం లేదంటున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై మున్సిపల్,ఫుడ్ సేఫ్టీ శాఖ వద్ద మాత్రం ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు.

Next Story

Most Viewed