లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష

by Kalyani |
లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : సహోద్యోగులను లైంగిక వేధింపులతో ఇబ్బంది పెట్టిన ఉద్యోగికి న్యాయస్థానం మూడేళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. భువనగిరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2017లో అప్పటి జిల్లా డీఎంహెచ్వో దురిశెట్టి కాళిదాసాచారి ఇద్దరు ఎస్టీ, బీసీ మహిళ సహోద్యోగులను తన అధికార హోదాను అడ్డుపెట్టుకుని లైంగికంగా వేధించాడు. దీంతో వారు ఆయనపై భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన నల్గొండలోని కోర్టు శుక్రవారం నిందితుడిని దోషిగా నిర్ధారించి, అతనికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో‌ పాటు రూ. 3 వేలు జరిమానా విధించినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed