గవర్నమెంట్ టీచర్లకు ఎంపీ చామల కీలక విజ్ఞప్తి

by Satheesh |
గవర్నమెంట్ టీచర్లకు ఎంపీ చామల కీలక విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వానికి తోడ్పాటునందించి విద్యార్థుల భవిష్యత్తును సమున్నతంగా తీర్చిద్దడంలో టీచర్లు భాగస్వాములు కావాలి అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేసి, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని చూస్తుంటే.. టీచర్లు మాత్రం పట్టణాలకు దగ్గర్లోనే ఉంటాం అంటున్నారన్నారు. ఇది సరైన పద్ధతి కాదు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా అభివృద్ధి చేయాలంటే టీచర్ల సహకారం అవసరం అని కోరారు.

Advertisement

Next Story

Most Viewed