KCR కంటే ఎక్కువ దాదాగిరి, గుండాగిరి చేసింది కేటీఆరే: బండి సంజయ్

by Disha Web Desk 19 |
KCR కంటే ఎక్కువ దాదాగిరి, గుండాగిరి చేసింది కేటీఆరే: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పవర్‌లో ఉన్నప్పుడు కేసీఆర్ కంటే ఎక్కువ కేటీఆరే అధికారం చెలాయించాడని కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ కంటే ఎక్కువగా దాదాగిరి, గుండాగిరి కేటీఆరే చేశారని అన్నారు. కేటీఆర్ పదేళ్లు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న ఇక్కడి సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని ఫైర్ అయ్యారు. సిరిసిల్లలో నేతన్నల దీన పరిస్థితికి కేసీఆర్, కేటీఆరే కారణమని దుయ్యబట్టారు.

నేతన్నలకు బకాయిలు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టారని, నేతన్నలకు 50 శాతం విద్యుత్ రాయితీ ఇస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. అధికారం పోయాక బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర దూషణలకు దిగాయని.. కానీ ఆ రెండు పార్టీలు ఒక్కటేనని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా పలు రూపాల్లో దోపిడీకి యత్నిస్తోందని మండిపడ్డారు. మరోసారి కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed