నేడు కవిత కేసు విచారణ.. రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ చార్జిషీట్..

by Ramesh N |
నేడు కవిత కేసు విచారణ.. రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ చార్జిషీట్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేడు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ ఛార్జిషీటు వేసిన సంగతి తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరగణలోకి తీసుకునే అంశంపై ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు కేసు విచారణ రానుంది. కాగా, లిక్కర్ స్కామ్‌ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అదే కేసులో తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ ఏప్రిల్ 11 వ తేదీన అరెస్టు చేసింది.

అయితే, లిక్కర్ కేసులో కవిత పాత్ర ఉందని ఆరోపిస్తూ పలు ఆధారాలతో కూడిన ప్రిలిమినరీ చార్జిషీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే కవిత ప్రమేయంపై విచారణ నేడు జరగనుంది. కాగా, కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరుతున్నా.. కోర్టు మాత్రం బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ వస్తుంది.



Next Story