ఎమ్మెల్యే టికెట్ కన్ఫార్మ్.. విషెస్ చెప్పేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్

by Rajesh |   ( Updated:2023-08-22 07:06:35.0  )
ఎమ్మెల్యే టికెట్ కన్ఫార్మ్.. విషెస్ చెప్పేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ప్రయాణిస్తున్న కారుకు మెదక్ జిల్లా చేగుంట వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మూడోసారి అధికార బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి బాజిరెడ్డి గోవర్ధన్ పేరు ఖరారు చేయడంతో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ వెళుతున్నారు.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన రాజారెడ్డి(సర్పంచ్ భర్త) రాజేందర్, అశోక్, భూమయ్య, హరిబాబులు ఒక కారులో బాజిరెడ్డిని కలిసేందుకు వెళ్తుండగా చేగుంట ఎక్స్ రోడ్ వద్ద కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడగా వారిని అంబులెన్స్‌లో స్థానికులు హైదరాబాద్ తరలించారు. ఈ విషయం తెలిసిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్‌కు తరలించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed