నిజామాబాద్ లో టీపీసీసీ చీఫ్ బహిరంగ సభ

by M.Rajitha |
నిజామాబాద్ లో టీపీసీసీ చీఫ్ బహిరంగ సభ
X

దిశ, వెబ్ డెస్క్ : నిజామాబాద్ లో నేడు మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), దామోదర రాజనర్సింహ(Damodara Rajanarasimha)తోపాటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పట్టణంలోని మాధవనగర్ సాయిబాబా ఆలయం నుండి కలెక్టరేట్ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాగా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా జిల్లాలో ఏర్పాటు చేస్తోన్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Next Story

Most Viewed