ముంబైలో మంత్రి సీతక్క... మహరాష్ట్ర ఎన్నికలపై డిస్కషన్

by M.Rajitha |
ముంబైలో మంత్రి సీతక్క... మహరాష్ట్ర ఎన్నికలపై డిస్కషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి సీతక్క ముంబై వెళ్లారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యారు. ముంబైలోని తిలక్ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ తో కలసి మహారాష్ట్ర ముఖ్య నేతలతో రివ్యూ ఏర్పాటు చేశారు. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. ప్రచారం, పోలింగ్ వంటి అంశాలపై చర్చించారు. ప్రజలను ఆకట్టుకునేందుకు చేయాల్సిన కార్యక్రమాలు వంటి వాటిపై చర్చించారు. ఏఐసీసీ అబ్జర్వర్ హోదాలో మంత్రి సీతక్క, ఉత్తమ్ లు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వార్ రూమ్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ సీఎంలు అశోక్ గెహలట్, భూపేష్ భగెల్, చన్నీ, పృధ్విరాజ్ చవాన్, మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ రమేష్ చన్నితల, మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షులు నానా పటోలె, ఎంపీ వర్షా గైక్వాడ్ తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed