Ponnam Prabhakar : రాష్ట్రంలో కులగణన పూర్తి చేస్తాం : మంత్రి పొన్నం

by Ramesh N |   ( Updated:2024-08-25 15:09:07.0  )
Ponnam Prabhakar : రాష్ట్రంలో కులగణన పూర్తి చేస్తాం : మంత్రి పొన్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో రాష్ట్రంలో కులగణన పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మసబ్ ట్యాంక్ ఆడిటోరియం‌లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓబీసీ అడ్వకేట్స్ కన్వెన్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో బీసీల పాత్ర మరువలేనిదని తెలిపారు.

ఈ విషయంలో ఆయన అందరినీ అభినందించారు. బీసీలు తమ హక్కులను సాధించుకోవాలన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి రోజు చెప్పానని గుర్తు చేశారు. మళ్లీ చెబుతున్నా.. తెలంగాణలో కులగణన పూర్తి చేస్తామన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బలహీనవర్గాల న్యాయవాదులు ఏకం కావాలని, జీవితం సార్థకం కావాలంటే హక్కుల కోసం పోరాడాలని మంత్రి పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed