- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Maha Shivratri: ‘మహాశివరాత్రి’ భక్తులకు శుభవార్త.. అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష

దిశ, డైనమిక్ బ్యూరో: మహాశివరాత్రి (Mahashivratri) సందర్భంగా భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. తెలంగాణ నుంచి ప్రముఖ దేవాలయాలకు వెళ్లే వారి కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మంగళవారం మంత్రి అధికారిక నివాస గృహంలో మహా శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాట్లపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సమీక్షా సమావేశం నిర్వహించారు.
మహా శివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా వెళ్ళే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్ళే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలిచ్చారు. గత సంవత్సరం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించాలని సూచనలు చేశారు. బస్స్టాండ్ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడి మునిశేఖర్, సీటీఎం శ్రీధర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప తదితరులు పాల్గొన్నారు.